News February 11, 2025
AMP: భూములకు సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాలువలు, డ్రైన్లు కు అవసరమైన చోట్ల క్రాస్ బండ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి తాసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 8, 2025
ఈనెల 10న హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

ఈనెల 10న (సోమవారం) హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై హనుమకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేల సంఖ్యలో యువకులు ఈ రిక్రూట్మెంట్కు హాజరవుతుండడంతో ఎలాంటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇన్స్పెక్టర్ అధికారులతో చర్చించారు.
News November 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 8, 2025
త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.


