News February 11, 2025

MNCL: MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన శేఖర్‌రావు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు.

Similar News

News March 11, 2026

‘హార్ముజ్’ దాటాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే: ఇరాన్

image

ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇండియాకు వెళ్తున్న థాయిలాండ్ <<19355576>>కార్గో షిప్‌పై దాడి<<>> చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ‘హార్ముజ్ గుండా ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వం. ఈ జలసంధి నుంచి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. ముడి చమురు బ్యారెల్‌ రేట్ 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.

News March 11, 2026

జీహెచ్‌ఎంసీ చట్టానికి మంగళం.. HYDలో కొత్త చట్టం!

image

GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, పాత ‘GHMC యాక్ట్-1955’ స్థానంలో కొత్తగా Core Urban Act తీసుకురావడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భవన నిర్మాణాల నుంచి రోడ్ల నిర్వహణ వరకు అంతా కేంద్రీకృత పద్ధతిలో సాగుతుంది. స్థానిక కార్పొరేషన్ల అధికారాలను కుదించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం (MAUD శాఖ) చేతుల్లోకి పాలనను తెచ్చుకోవడమేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

News March 11, 2026

జీహెచ్‌ఎంసీ చట్టానికి మంగళం.. HYDలో కొత్త చట్టం!

image

GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, పాత ‘GHMC యాక్ట్-1955’ స్థానంలో కొత్తగా Core Urban Act తీసుకురావడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భవన నిర్మాణాల నుంచి రోడ్ల నిర్వహణ వరకు అంతా కేంద్రీకృత పద్ధతిలో సాగుతుంది. స్థానిక కార్పొరేషన్ల అధికారాలను కుదించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం (MAUD శాఖ) చేతుల్లోకి పాలనను తెచ్చుకోవడమేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.