News February 11, 2025
NRPT: ATMల వద్ద నగదు కాజేస్తున్న నిందితుడి అరెస్టు

ప్రజలను ఏమార్చి ఏటీఎంల వద్ద నగదు కాజేస్తున్న నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు. ఏపీలోని తిరుపతి జిల్లా చిన్నగట్టికల్లు మండలం రంగన్నగారి గడ్డకు చెందిన రియాజ్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్ 26న సింగారం గ్రామానికి చెందిన ఖాతాల్ అనే వ్యక్తి ఏటీఎం మార్చి రూ.లక్ష 95 వేలు కాజేశాడని చెప్పారు. నిందితుడుని ఇవాళ అరెస్టు చేసినట్లు వివరించారు.
Similar News
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
News March 14, 2026
కార్యకర్తల మధ్యే మంత్రి.. సత్యకుమార్ వినయానికి ప్రశంసలు!

ధర్మవరంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ క్లాసులో మంత్రి సత్యకుమార్ కార్యకర్తలా పాల్గొని ప్రశంసలు పొందారు. పదవిలో ఉన్నా ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. తోటి కార్యకర్తలతో కూర్చొని శ్రద్ధగా వినడం ఆయన వినయాన్ని ప్రతిబింబించింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతీ కార్యకర్తలో ఉండాలని ఆచరణతో చూపించారు. కార్యకర్తలతో నడవడమే నిజమైన నాయకత్వమని ఈ దృశ్యం తెలుపుతోంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్కు నో ఎంట్రీ.. ట్రంప్కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్కు ట్రంప్ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.


