News February 11, 2025

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..!

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో పీఆర్టీయూ ప్రతినిధులు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలి. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థి పేరుకు ముందు 1 అంకె వేయాలి. తర్వాత 2, 3, 4, 5 ఇలా ఎన్ని అంకెలైనా వేయవచ్చు. 1 అంకె వేయకుండా మిగిలిన అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. టిక్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు.

Similar News

News October 29, 2025

తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

image

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.

News October 29, 2025

నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

image

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News October 29, 2025

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.