News February 11, 2025
యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
Similar News
News April 18, 2026
కామారెడ్డి: సప్త ప్రాకారాల సిద్ధిరామేశ్వరాలయం

భిక్కనూర్లోని సిద్ధిరామేశ్వర ఆలయానికి సప్తప్రాకారాల ఆలయంగా పేరు ఉంది. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయానికి ఏడు వరసల గోడలు ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని, శత్రువుల దాడి నుంచి కాపాడటానికి ఈ నిర్మాణం చేశారని స్థానికులు చెబుతారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై కాకతీయుల శిల్పకళా ముద్రలు కనిపిస్తాయి. సుమారు 800 సం.రాల క్రితం నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు.
#WORLD HERITAG SPECIAL
News April 18, 2026
ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

TG అర్బన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో దశలో సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో తీసుకొని వారికి 2BHK ఇళ్లు ఏ స్థితిలో ఉంటే అలాగే అప్పగించాలని GOVT నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి Way2Newsకు తెలిపారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే వారికి బిల్లులు మంజూరు చేస్తారు. వీటి కోసం లబ్ధిదారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి MBNR జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
News April 18, 2026
ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

TG అర్బన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో దశలో సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో తీసుకొని వారికి 2BHK ఇళ్లు ఏ స్థితిలో ఉంటే అలాగే అప్పగించాలని GOVT నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి Way2Newsకు తెలిపారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే వారికి బిల్లులు మంజూరు చేస్తారు. వీటి కోసం లబ్ధిదారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి MBNR జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.


