News February 11, 2025
కాంగ్రెస్ షోకాజ్ నోటీసును పట్టించుకోను: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
Similar News
News March 10, 2026
కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.
News March 10, 2026
పశువులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి: కలెక్టర్

పశువులకు సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ టీకాలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డిలో పశువుల ఆరోగ్య సంరక్షణకు 8వ విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పశువులకు ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో టీకాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దేవేందర్, తదితరులున్నారు.


