News February 11, 2025
నల్గొండ: ఓటరు జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. NLG సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఆధ్వర్యంలో 33 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం మొత్తం 10,77,817 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 5,33,333 మంది, మహిళలు 5,44,429 మంది, ఇతరులు 55 మంది ఉన్నారు.
Similar News
News November 2, 2025
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News November 1, 2025
శిశు విక్రయాలు, లైంగిక దాడులపై కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలో ఆడబిడ్డల రక్షణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడులు వంటి వాటిని అరికట్టడంలో అన్ని సంక్షేమ శాఖలు, ఆర్.సీ.ఓ.లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ దుశ్చర్యలకు పాల్పడితే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 1, 2025
చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.


