News February 11, 2025
రేపు YCPలో చేరనున్న TDP మాజీ MLA కుమారుడు

మాజీ MLA గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీశ్ YCPలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 12న ఆయన YCP అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా ఈయన గత ఎన్నికల్లోనే నగరి నుంచి MLAగా పోటీ చేయాలని భావించినా పలు కారణాలతో అది వీలుపడలేదు.
Similar News
News March 8, 2026
గుంటూరుకు వైద్య సేవలందించిన అన్నా సారా కుగ్లర్

అమెరికాలో జన్మించిన డాక్టర్ అన్నా సారా కుగ్లర్ గుంటూరు ప్రజలకు విశేష సేవలు అందించారు. భారతదేశంలో ఆమె తొలి మెడికల్ మిషనరీగా అడుగుపెట్టారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల వైద్యం కోసం గుంటూరులో ఒక ఆసుపత్రిని స్థాపించారు. దాదాపు 47ఏళ్ల పాటు నిరంతరంగా ప్రజలకు వైద్య సేవలందించారు. ఆమె చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆ ఆసుపత్రికి ‘కుగ్లర్ ఆసుపత్రి’ అని పేరు పెట్టారు. మహిళా సేవామూర్తులలో ఆమె ఎప్పటికీ ఆదర్శనీయం
News March 8, 2026
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు.. ఆదేశాలు జారీ

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అధికారులు 200 గజాల స్థలాన్ని గుర్తించి నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. ఒక్కో భవనాన్ని ₹10L ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించింది. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. కాగా డ్వాక్రా సంఘాల్లో 63L మంది సభ్యులున్నారు.
News March 8, 2026
నాయుడుపేట: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పెళ్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై అదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్డ్రింక్స్ లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమార్ను 108 అంబులెన్స్లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


