News February 11, 2025

తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.

Similar News

News July 7, 2025

ఆకాశ్ దీప్.. ఆకాశమంత టాలెంట్ అంతే మనస్సు

image

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్‌కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బా‌లో గతంలో ఆకాశ్ గురించి ‌స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్‌తో అందరికీ అర్థమైంది.

News July 7, 2025

గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన ఆమిర్ ఖాన్

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మిరా అని నామకరణం చేశారు. కాగా ‘మిరా అంటే ప్రేమ, శాంతి. ఆమిర్ సర్‌ మీతో ప్రయాణం ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ SMలో పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.

News July 7, 2025

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50 వేల ఉద్యోగాలు!

image

2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.