News February 11, 2025

WGL: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హనుమకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Similar News

News November 11, 2025

TODAY HEADLINES

image

➤ ఢిల్లీలో పేలుడు.. 13 మంది మృతి, దేశవ్యాప్తంగా హైఅలర్ట్
➤ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా
➤ రచయిత అందెశ్రీ కన్నుమూత.. రేపు అంత్యక్రియలు
➤ స్పీకర్‌పై సుప్రీంకోర్టులో BRS కోర్టు ధిక్కార పిటిషన్
➤ రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
➤ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు CBI సిట్ తేల్చింది: TDP

News November 11, 2025

HYD: అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

image

రాజేంద్రనగర్‌ హనుమాన్‌నగర్‌ ప్రాంతానికి ధనుష్‌ కుమార్‌(22) హౌస్‌ కీపింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వస్తానని తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటికి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రితోపాటు చుట్టు పక్కల వెతికారు. సోమవారం వాలంతరి ఏపీఈఆర్‌ఎల్‌ వెనుక చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

SRCL: చిన్న నీటి పారుదల వవరులపై సమీక్ష సమావేశం

image

చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వేపై డీఆర్డీఓ, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీఓ తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు.