News February 11, 2025
కుంభామేళాకు పోటెత్తనున్న భక్తులు.. అధికారుల కీలక నిర్ణయం

ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజూ దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా.
Similar News
News January 2, 2026
బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఏది?

2025లో టాలీవుడ్ నుంచి ‘OG’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మినహా ఏ సినిమా రూ.300Cr+ కలెక్ట్ చేయలేదు. ధురంధర్, చావా, కాంతార: ఛాప్టర్-1 వంటి ఇతర భాషల సినిమాలు రూ.700cr+ రాబట్టాయి. దీంతో ఈ ఏడాది రిలీజయ్యే టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాక్సాఫీసు వద్ద ఏ మేరకు రాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’, NTR ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ లిస్టులో ఉన్నాయి.
News January 2, 2026
టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 2, 2026
అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.


