News February 11, 2025

యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్!

image

యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ గురైనట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ ఉద్యోగి విధులకు హాజరుకాకపోగా, రికార్డు అసిస్టెంట్ కొండపైకి వెళ్లే వాహనాల రుసుములను ఆలయానికి చెల్లించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News November 11, 2025

మెదక్: చేగుంటలో చిరుత పులి మృతి

image

చేగుంట మండలం గొల్లపల్లి తండా, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన <<18254855>>చిరుత పులి <<>> మంగళవారం ఉదయం మృతి చెందింది. నిన్న సాయంత్రం చెట్ల పొదల్లో కదలలేని స్థితిలో కనిపించిన చిరుతను గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయానికి మృతి చెందిన చిరుతపులిని గొడుగుపల్లి శివారులో గుర్తించారు. అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు.

News November 11, 2025

జడ్చర్ల: విద్యార్థి పై దాడి..బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు

image

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిని చెవికి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై, పాఠశాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ బాలల హక్కుల సంఘానికి, మానవ హక్కుల సంఘానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 11, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.isro.gov.in/