News February 11, 2025

HYD: రూ.వేలకు వేలు వసూలూ.. అయినా లేట్

image

ప్రైవేటు బస్‌ల ఆగడాలు ప్రయాణికులకు నరకంగా మారింది. వేలకు వేలు టిక్కెట్ల రూపంలో వసూలు చేసి మధ్యలోనే బస్ చెడిపోయిందని తీవ్ర ఆలస్యం చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం మరో బస్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదని ట్రావెల్స్ ఆఫీస్‌కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదంటున్నారు. తాజాగా విజయవాడ జాతీయ రహదారిపై శివారు ప్రాంతంలో ప్రయాణికులకు ఇలాంటి అనుభవమే ఎదురై తీవ్ర ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.

Similar News

News February 11, 2025

ఎల్బీనగర్‌: మైనర్ బాలికపై లైంగిక దాడి.. జీవిత ఖైదు

image

ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షేక్ జావీద్(27) దోషి అని తేలడంతో అతడిపై అత్యాచారం, పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.25వేల జరిమానా, బాధితురాలకి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది.

News February 11, 2025

HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి 

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2025

HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

image

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.

error: Content is protected !!