News February 11, 2025

గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

image

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 11, 2025

వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.

News February 11, 2025

వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

image

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

News February 11, 2025

ఎన్టీఆర్: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!