News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

అదానీ గ్రూప్పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.
Similar News
News December 31, 2025
2026 రిపబ్లిక్ పరేడ్.. చరిత్రలో తొలిసారి యానిమల్ కంటింజెంట్

2026 రిపబ్లిక్ డే పరేడ్లో కొత్తగా యానిమల్ కంటింజెంట్ ప్రదర్శన జరగనుంది. సైన్యంలోని రీమౌంట్ & వెటర్నరీ కార్ప్స్లో శిక్షణ తీసుకున్న జంతువులు కవాతు చేయనున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో బార్డర్ల వెంబడి భద్రతకు ఉపయోగించే 2 బాక్ట్రియన్ ఒంటెలు, 4 రాప్టార్లు, 10ఇండియన్ బ్రీడ్ ఆర్మీ, 6 కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్ ప్రదర్శనలో పాల్గొంటాయి. లద్దాక్కు చెందిన జన్స్కార్ పోనీలు కవాతు చేయనున్నాయి.
News December 31, 2025
ఏంటీ AGR రచ్చ? వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఇచ్చిన ఊరట ఇదే!

వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం భారీ ఊరటనిచ్చింది. AGR అనేది టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు. తమకు కేవలం ఫోన్ కాల్స్, డేటా ద్వారా వచ్చే ఆదాయంపైనే ఫీజు వేయాలని కంపెనీలు వాదించగా.. అద్దెలు, డివిడెండ్లు సహా ఇతర ఆదాయాలను కూడా కలపాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికే మద్దతు తెలపడంతో కంపెనీలపై ₹వేల కోట్ల అదనపు భారం పడింది.
News December 31, 2025
తెలుగు ప్రజలకు నేతల శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు CMలు, నేతలు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘పింఛన్లు అందుకున్న లబ్దిదారులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు’ అని CM CBN ట్వీట్ చేశారు. ‘కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలును చేరుకోవాలని’ అని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘2026లో కూటమి మరింత మెరుగైన సేవలందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది’ అని పవన్ ట్వీట్ చేశారు. ‘కొత్త ఏడాది ప్రతొక్కరి ఇంట్లో ఆనందం నింపాలని’ జగన్ కోరుకున్నారు.


