News February 11, 2025
వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.
Similar News
News February 21, 2026
వేడెక్కిన కశ్మీర్.. ALL TIME RECORD

ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీర్ ఇవాళ వేడెక్కెంది. ఏకంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతంలో FEBలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా రికార్డయింది. అక్కడ 1940, 2016లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలను తాకింది. అలాగే ఈ నెలలో మంచుతో కప్పబడే గుల్మార్గ్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు కాగా ఇవాళ 11.5 డిగ్రీలకు చేరింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News February 21, 2026
పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.
News February 21, 2026
ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


