News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 10, 2025

NLG: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ

image

రాష్ట్రంలోనే పేరెన్నిక గల కట్టంగూరు పశువుల సంత 75 ఏళ్లు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. 1950లో ఏర్పడిన ఈ సంత 75 ఏళ్లు దాటినా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ప్రతి శనివారం ఇక్కడ వేలాది పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100కు పైగా గ్రామాల నుంచి రైతులు పశువులు, గొర్రెలు, మేకలు విక్రయాల కోసం ఇక్కడికి వస్తుంటారు.

News November 10, 2025

అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

image

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం ప్రజల్లో స్ఫూర్తి నింపిందని గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

News November 10, 2025

నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

image

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.