News February 11, 2025
రావులపాలెం జొన్నాడ బ్రిడ్జి కింద మహిళ మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257195517_52038603-normal-WIFI.webp)
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మహిళ 5,4 పొడవు, నీలి రంగు చీరతో ఉందన్నారు.
Similar News
News February 12, 2025
గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293539915_718-normal-WIFI.webp)
ఈనెల 9న సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్క్స్ క్లాత్ షోరూమ్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్ కుమార్(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు.
News February 12, 2025
బూతులతో రెచ్చిపోయిన నటుడు పృథ్వీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292178101_695-normal-WIFI.webp)
హైబీపీతో బాధపడుతూ HYDలోని ఓ <<15429041>>ఆస్పత్రిలో చేరిన<<>> నటుడు పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. ‘11 అనే మాట వస్తే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారు. సినిమాను సినిమాగా చూడండి. నా తల్లిని నీచంగా మాట్లాడుతున్నారు కదరా’ అంటూ రాయడానికి వీలులేని తీవ్ర అసభ్య పదజాలంతో దుయ్యబట్టారు. కాగా ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
News February 12, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293116375_51263166-normal-WIFI.webp)
> కొడకండ్ల బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు > పాలకుర్తిలో ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన డిసిపి> ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ > తీగారం దుర్గమ్మ ఆలయంలో చోరీ > ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం టీపీసీసీ సభ్యులు అమృత రావు > కేటీఆర్ను కలిసిన తాటికొండ రాజయ్య > కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ను కలిసిన ఎంపీ కడియం కావ్య.