News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

Similar News

News January 2, 2026

శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

image

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.

News January 2, 2026

భూపాలపల్లి: కొత్త సంవత్సరం పూట.. ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు!

image

కొత్త సంవత్సరం పూట ఆ ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారు. ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. BHPL జిల్లా నేరేడుపల్లికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో జిల్లాకేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు కవలల(ఆడపిల్లలు)కు జన్మనిచ్చింది. న్యూ ఇయర్ రోజు కవలలు పుట్టడంతో కుటుంబ సభ్యలు సంతోషంలో మునిగిపోయారు.

News January 2, 2026

విద్యుత్ శాఖలో కోరుట్ల రూరల్ సబ్ డివిజన్‌కు మొదటి ర్యాంకు

image

TGNPDCL పరిధిలోని 16 జిల్లాల్లో జగిత్యాల జిల్లాకు చెందిన కోరుట్ల రూరల్ సబ్ డివిజన్ మొదటి ర్యాంకు సాధించింది. నవంబర్ నెలలో రెవెన్యూ, మెయింటెనెన్స్, సర్వీసుల రిలీజ్ టార్గెట్లో కోరుట్ల రూరల్ సబ్ డివిజన్ ముందంజలో ఉంది. దీనికిగాను కృషి చేసిన కోరుట్ల రూరల్ ADE బి.రఘుపతిని SE సుదర్శనం, మెట్పల్లి DE మధుసూదన్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందించారు. తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.