News March 20, 2024
విశాఖకు చేరుకున్న ఐపీఎల్ జట్ల ప్రతినిధులు

విశాఖ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్ గంగూలీ, డేవిడ్ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Similar News
News March 12, 2026
VZM: డొమెస్టిక్ సిలిండర్లు వాడితే ‘6A’ కేసులు

విజయనగరం జిల్లాలోని హోటళ్లు, దాబాలు, వాణిజ్య కేంద్రాల్లో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాథ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 6A కేసులు నమోదు చేస్తామన్నారు. ఆరు నెలల్లో 10 కేసులు నమోదు చేసి, 40 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు ఇవాళ తెలిపారు. అక్రమ రీఫిల్లింగ్, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 11, 2026
VZM: మహిళతో పెళ్లికి నిరాకరణ..ఏడాది జైలు శిక్ష

మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడు బండి సుచిత్కు మహిళా కోర్టు బుధవారం ఏడాది శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. బూర్లిపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాక మొహం చాటేశాడనే మహిళ ఫిర్యాదుతో కేసును కోర్టుకు అప్పగించగా..శిక్ష ఖరారైందని విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్. గోవిందరావు మీడియాకు తెలిపారు.
News March 11, 2026
VZM: ఇన్స్టాగ్రామ్ లవ్..చివరికి జైలు పాలు

ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో కొండవెలగాడ గ్రామానికి చెందిన నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానాను బుధవారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నెల్లిమర్ల PSలో నమోదైన ఈ కేసులో నేరం నిరూపితమవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.


