News February 11, 2025

GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

Similar News

News November 6, 2025

నా పిల్లలు చనిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు: చిన్మయి

image

SMలో అబ్యూస్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లైనా పర్వాలేదు నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.

News November 6, 2025

నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

* 1913: మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేశారు
* 1940: గాయని, రచయిత శూలమంగళం రాజ్యలక్ష్మి జననం
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)
* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం

News November 6, 2025

ములుగు : ప్రాణాంతకంగా అడవి పందులు, కోతులు..!

image

జిల్లాలో కోతులు, అడవి పందుల బెడద ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ రెండు ప్రాణులు ఇప్పుడు మనుషులకు ప్రాణాంతకంగా మారాయి. గ్రామాలలో మందలుగా తిరుగుతున్న కోతులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో చాలామంది గాయపడుతున్నారు. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇదే తరహాలో అడవి పందులు పంటల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాపలాకు వెళ్లిన రైతులపై దాడులకు పాల్పడుతున్నాయి. వీటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.