News February 11, 2025
మహబూబాబాద్: సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు స్పెషల్ బస్సు

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పురస్కరించుకొని మహబూబాబాద్ డిపో నుంచి ఉ.8 గ.లకు జాతర స్పెషల్ బస్సును ప్రారంభిస్తున్నామని డిపో మేనేజర్ శివప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బస్సు ఉదయం 08:00 గంటలకు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 12:00 pm మేడారం చేరుకొని, మళ్లీ సాయంత్రం 5:00 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటుందని మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News November 9, 2025
కరీంనగర్: జాతీయ స్థాయికి ఒగ్గుడోలు విద్యార్థులు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్- 2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు పక్కా: జగ్గారెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని, పథకాలతో పాటు అభివృద్దికి పెద్దపీట వేస్తుందన్నారు. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లు జగ్గారెడ్డి కోరారు. ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.
News November 9, 2025
పాటీదార్కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


