News February 11, 2025

మల్కాజిగిరి: మహిళల రక్షణే ధ్యేయం: డీసీపీ 

image

మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ హెచ్చరించారు. నెల రోజుల్లో 163 మంది పోకిరిలను సాక్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోఈవ్ టీజర్లకు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

Similar News

News February 25, 2026

తిరుచ్చిపై విహరించిన శ్రీ కృష్ణస్వామి

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణస్వామివారు బుధవారం రాత్రి బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచ్చి పై నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

News February 25, 2026

ఎంపీ కడియం కావ్యకు అరుదైన గౌరవం

image

ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఇండియా- సౌదీఅరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ సభ్యురాలిగా కావ్యను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ (కాన్ఫరెన్స్ అండ్ ప్రొటోకాల్ విభాగం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్-సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ ఏర్పాటు చేశారు.

News February 25, 2026

ఊరిలో సగం మంది కవలలే..!

image

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో..