News February 11, 2025

ఏఐసీసీ చీఫ్‌ను కలిసిన పెద్దపల్లి పెద్దలు..

image

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఖర్గేతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనీ మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు.

Similar News

News September 15, 2025

ములుగు గ్రీవెన్స్‌లో 71 దరఖాస్తులు

image

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వేకరించారు. మొత్తం 71 దరఖాస్తులు రాగా.. అందులో 26 రెవిన్యూ, 6 ఇందిరమ్మ ఇళ్లు, 7 పెన్షన్, 6 ఉద్యోగం, 26 ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.

News September 15, 2025

గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

image

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

image

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.