News February 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 17 నుంచి 10వ తరగతి పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 24 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 8, 2026
SKLM: ఉద్యోగాల దరఖాస్తులకు నేడే లాస్ట్ ఛాన్స్

శ్రీకాకుళం జిల్లాలోని మోడల్ స్కూల్ లలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్స్ స్కూళ్లలో దాదాపు 15 పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవిబాబు ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సందర్శించాలని దరఖాస్తులను ఆయా మోడల్ స్కూల్లలో సమర్పించవచ్చని ఆయన సూచించారు.
News January 8, 2026
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.
News January 8, 2026
సత్తుపల్లి జిల్లాపై మళ్ళీ చర్చ.. నెరవేరేనా ప్రియాంక గాంధీ హామీ?

సత్తుపల్లి జిల్లా హామీపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ‘నచ్చిన వారికి జిల్లాలు’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు పడతాయా? లేక రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సత్తుపల్లి ఆశలు మళ్లీ చిగురించాయి.


