News February 12, 2025
ఆధార్ అప్డేట్కు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టండి: కలెక్టర్

ఐదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని ఆయన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఆధార్ నమోదు స్థితిగతులపై చర్చించారు.
Similar News
News January 16, 2026
భిక్కనూర్: అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు పెద్దమల్లారెడ్డి నుంచి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు సేఫ్గా బయటపడ్డారు.
News January 16, 2026
ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.
News January 16, 2026
నంద్యాల: అవును.. మీకు తెలుసా..!

నల్లమల అడవిలోని గిరిజన గూడాల్లో నివసించే చెంచులు శ్రీశైల భ్రమరాంబ దేవిని కూతురుగా, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో మకర సంక్రాంతి రోజున పార్వతి పరమేశ్వరుల లీల కళ్యాణ మహోత్సవానికి చెంచులే అతిథులుగా నిలిచి, ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు.


