News March 20, 2024
నేను మా ఆయన భార్యను!
దేశంలో తొలి లోక్సభ ఎన్నికల్లో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేరు చెప్పలేదు. ఫలానా వ్యక్తి భార్యననో, ఫలానా వ్యక్తి కూతురుననో అని చెప్పారు. అప్పటి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆ మహిళలు అలా ప్రవర్తించారు. ఈ సమస్య ఎక్కువగా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎదురైంది. కాగా సరైన పేర్లు చెప్పని 28 లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు.
Similar News
News October 1, 2024
4 నెలల వయసులో చిన్నారికి పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు
తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్లోని జోధ్పూర్లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.
News October 1, 2024
మూసీ శుద్ధీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణశాసనమే: కోమటిరెడ్డి
TG: మూసీ నది శుద్ధీకరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ విష రసాయనాలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు, కాయగూరలను ఎవరూ కొనని పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుద్ధీకరణ కోసం ముందడుగు వేస్తుంటే రోజుకో కుట్రతో BRS రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణం అని విమర్శించారు.
News October 1, 2024
తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?
TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.