News February 12, 2025
ADB వాసికి అంతర్జాతీయ అవార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278593347_20476851-normal-WIFI.webp)
అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.
Similar News
News February 12, 2025
ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295175704_728-normal-WIFI.webp)
ఆదిలాబాద్ డివిజన్లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
ADB: EPASS SCHOLARSHIPS.. APPLY NOW
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289514808_51600738-normal-WIFI.webp)
ADB జిల్లాలో ఇంటర్ ఆపైన చదువుతున్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలకు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని DSCDO సునీత కుమారి తెలిపారు. రినివల్, ఫ్రెష్ పోస్ట్మెట్రిక్ విద్యార్థులు 31 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపకారవేతనములు పొందేందుకు SSC మెమో, ఆధార్ కార్డులలోని పేరు ఒకేలా ఉండాలన్నారు.
News February 12, 2025
ADB: నార్నూర్లో రూ.2లక్షలు..ఇంద్రవెల్లిలో రూ.8లక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739288634998_51867103-normal-WIFI.webp)
వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు. మూడు రోజుల కిందట నార్నూర్ మండలంలోని వ్యాపారి ఇంట్లో రూ.2 లక్షలు చోరీ కాగా ఇంద్రవెల్లిలోని వెంకటి ఇంట్లో రూ.8లక్షలు చోరీ ఆయ్యాయి. కూతురు పెళ్లి కోసం రూ.8 లక్షలు జమ చేసి ఇంట్లో ఇనుప పెట్టెలు దాచానని శనివారం గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని వెంకటి ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.