News February 12, 2025
సంగారెడ్డి: టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295382239_774-normal-WIFI.webp)
ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్లో 25 , మెదక్ డివిజన్లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
HYD: అమ్మాయిలు.. అలా చేస్తే ఊరుకోకండి: డీసీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319486200_15795120-normal-WIFI.webp)
కొద్దిపాటి పరిచయం ఉన్నవారితోనూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రహస్యంగా అమ్మాయిల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవ్వరికీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంపొద్దని HYD సైబర్ క్రైమ్ డీసీపీ కవిత సూచించారు. టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని, నగ్న విడియోలతో వేధింపులకు గురి చేస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని 100, 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
News February 12, 2025
గుంటుపల్లిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290531641_51973468-normal-WIFI.webp)
గుంటుపల్లి శివారులో మంగళవారం కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గుంటుపల్లి శివారు కృష్ణానది ఒడ్డున ఓ షెడ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుమారుగా 30 రోజుల క్రితం వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 12, 2025
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323607751_782-normal-WIFI.webp)
AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.