News February 12, 2025
ములుగు: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295639222_930-normal-WIFI.webp)
ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
Stock Markets: కుప్పకూలాయి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734703367305_1124-normal-WIFI.webp)
స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.
News February 12, 2025
దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333164292_367-normal-WIFI.webp)
TG: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దని మీసేవ సెంటర్లను ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News February 12, 2025
2కె పరుగును ప్రారంభించిన వరంగల్ సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333883210_50199223-normal-WIFI.webp)
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్(టీఎస్ జేయూ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రారంభించారు. నగర ప్రముఖులు, విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్న ఈ పరుగు ఈరోజు ఉదయం వరంగల్ పోచమ్మ మైదానం నుంచి ప్రారంభమై కాకతీయ వైద్య కళాశాల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.