News March 20, 2024

రూ.42వేల విలువైన మద్యం సీజ్: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యాన ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రామన్నపేట వద్ద రూ.19,628, దానవాయిగూడెం వద్ద రూ.18,469, గోపాలపురం వద్ద రూ.4,681 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యాన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Similar News

News July 5, 2024

ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం 

image

ఖమ్మం రూరల్ మండలం‌ దానావాయిగూడెం వద్ద  రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.‌ ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

News July 5, 2024

ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

image

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.