News February 12, 2025

ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

image

ఆదిలాబాద్ డివిజన్‌‌లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 16, 2025

19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:50కి విమానాశ్రయం చేరుకుని, 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10:20కి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి కోయంబత్తూర్‌కు బయలుదేరనున్నట్లు పీఎంవో తెలిపింది.

News November 16, 2025

200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

image

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్‌తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 16, 2025

కొనుగోలు కేంద్రాల్లో 4983 మెట్రిక్ టన్నుల ధాన్యం: కలెక్టర్

image

జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాకు నేటి వరకు 4983.920 మెట్రిక్ టన్నులధాన్యం చేరుకున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17%తేమతో 2263.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2151.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశామని, 112.360 మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.1.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.