News February 12, 2025
జేఈఈలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323689057_727-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్ సెషన్-1లో అనంతపురం, సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అనంతపురానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి 99.99 పర్సంటైల్, గాండ్లపెంట మండలం సోమామాజులపల్లికి చెందిన ఓం కిరణ్ 99.91, అనంతపురం అశోక్ నగర్కు చెందిన అసిఫ్ 99.48, అనంతపురానికి చెందిన భావ, విశాల్ 99.43, 99.36 పర్సంటైల్తో సత్తా చాటారు.
Similar News
News February 12, 2025
HYD: కోర్ వైపు కష్టమే.. అంతా కంప్యూటర్ వైపే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324540521_15795120-normal-WIFI.webp)
HYD, RR, MDCL కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ తదితర కోర్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పడిపోతున్నాయి. విద్యార్థుల ఆలోచనను పసిగట్టి, కోర్ బ్రాంచీలు తీసేసి కంప్యూటర్ కోర్సుల వైపు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి.వచ్చే ఏడాదికి తమకు AI, కంప్యూటర్ సైన్స్ (CSE)లాంటి కోర్సులు నడిపేందుకు పర్మిషన్ కావాలని సుమారు 15కు పైగా కాలేజీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి.
News February 12, 2025
HYD వితౌట్ ఇంటర్నెట్..! మీ కామెంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323739527_15795120-normal-WIFI.webp)
HYDలో ఒక్కసారి ఇంటర్ నెట్ ఆగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం పెరిగిన డిజిటలైజేషన్ మేరకు దేశ, విదేశాల నుంచి వచ్చి HYD కేంద్రంగా చేస్తున్న ప్రతి ఉద్యోగానికి ఇంటర్నెట్ ముడిపడి ఉంది. అసలు ఇంటర్నెట్ లేనిదే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఊహించండి HYD వితౌట్ ఇంటర్నెట్ అంటూ..Xలో పలువురు వేలాది పోస్టులు చేస్తున్నారు. అది అసాధ్యం అని కొందరు, బతకలేం అని ఇంకొందరు అంటున్నారు.
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738426758075_81-normal-WIFI.webp)
TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.