News February 12, 2025
కాకినాడ జిల్లా వాసులకు ALERT

కాకినాడ జిల్లా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి మండలానికి రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పశువర్ధక శాఖ ప్రకటించింది. మంగళవారం మొత్తం 42 బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలించాయి. 82 ఫారాలలో 62 లక్షల కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా కోళ్ల మరణాలు జరిగితే వెంటనే అధికారులు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News November 5, 2025
గోదావరిఖని: పీజీ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు

గోదావరిఖని ప్రభుత్వ పీజీ కళాశాల ఎంబీఏ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో విద్యార్థినులు దూడెం తరుణ, మునిగంటి మౌనిక, దేవులపల్లి ఉషశ్రీ, పున్నం కళ్యాణి, కందూరి కళ్యాణి, చిట్టవేణి సాగరిక ఉన్నారు. ఈనెల 7న శాతవాహన యూనివర్సిటీ నిర్వహించే ద్వితీయ స్నాతకోత్సవ వేడుకల్లో వీరు బంగారు పతకాలను అందుకోనున్నారు.
News November 5, 2025
ANU దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బిబిఎం, బిహెచ్ఎం, బిబిఏ, ఇయర్ ఎండ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషల్ వర్క్, మొదటి, ద్వితీయ, తృతీయ సెమిస్టర్, తదితర ఫలితాలను విడుదల చేశారు.
News November 5, 2025
పాలకుర్తి: ‘6 గ్యారంటీలు, 420 హామీలతో కాలయాపన’

రెండేళ్లుగా 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటివరకు చేసింది ఏమీలేదని BRS పార్టీ పాలకుర్తి మండల అధికార ప్రతినిధి ములుకాల కొమురయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన రోడ్లను ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మక్క సారలమ్మ గుడికి MLA రూ.50 లక్షలు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదన్నారు.


