News February 12, 2025

సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

భిక్కనూర్: అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు పెద్దమల్లారెడ్డి నుంచి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు సేఫ్‌గా బయటపడ్డారు.

News January 16, 2026

ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

image

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.

News January 16, 2026

నంద్యాల: అవును.. మీకు తెలుసా..!

image

నల్లమల అడవిలోని గిరిజన గూడాల్లో నివసించే చెంచులు శ్రీశైల భ్రమరాంబ దేవిని కూతురుగా, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో మకర సంక్రాంతి రోజున పార్వతి పరమేశ్వరుల లీల కళ్యాణ మహోత్సవానికి చెంచులే అతిథులుగా నిలిచి, ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు.