News February 12, 2025
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323607751_782-normal-WIFI.webp)
AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.
Similar News
News February 12, 2025
Stock Markets: షార్ప్ రికవరీతో హ్యాపీ.. హ్యాపీ..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732502136538_1199-normal-WIFI.webp)
దేశీయ స్టాక్మార్కెట్లలో షార్ప్ రికవరీ జరిగింది. బెంచ్మార్క్ సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి బలంగా పుంజుకున్నాయి. ఆరంభంలో 200Pts నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 34 pts లాభంతో 23,108 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ -600 నుంచి +89కి చేరుకొని 76,377 వద్ద చలిస్తోంది. ఫైనాన్స్, మెటల్, బ్యాంకు, మీడియా రంగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. SBILIFE, BAJAJFINSV, HDFCLIFE, ULTRACEMCO, ADANIENT టాప్ గెయినర్స్.
News February 12, 2025
శెభాష్ పోలీస్.. నిమిషాల్లో ప్రాణం కాపాడారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739342287593_746-normal-WIFI.webp)
AP: ఆర్థిక ఇబ్బందులతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేయగా పోలీసులు అతణ్ని కాపాడి శెభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి CI భీమరాజుకు ఫిర్యాదు రావడంతో లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న SI శ్రీహరికి సమాచారమిచ్చారు. వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేశారు. ఉరేసుకునేముందు వారు తలుపు నెట్టి కాపాడారు. ఇదంతా 6 నిమిషాల్లోనే జరగడం విశేషం.
News February 12, 2025
పవన్పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344373859_1226-normal-WIFI.webp)
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి ఆనందం తెప్పిస్తోందని సెటైర్ వేశారు. బడ్జెట్కు ముందు కీలకమైన సమావేశాలకూ PK డుమ్మా కొట్టారని విమర్శించారు. కాగా దక్షిణాది ఆలయాల పర్యటనలో ఉన్న పవన్ ఇవాళ ఉదయం కేరళలోని పలు దేవాలయాలను సందర్శించారు.