News February 12, 2025
గుంటుపల్లిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం

గుంటుపల్లి శివారులో మంగళవారం కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గుంటుపల్లి శివారు కృష్ణానది ఒడ్డున ఓ షెడ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుమారుగా 30 రోజుల క్రితం వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 4, 2025
వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>
News November 4, 2025
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తకోట(M) పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత ఉంది అనేది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.


