News February 12, 2025
యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్తో కలిసి బైక్పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్లోనే చనిపోగా.. సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News January 15, 2026
U19 WC: USAపై భారత్ విజయం

U19 వన్డే WCలో USAతో మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత USA 107 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారత్ ఛేజింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులకు కుదించారు. IND 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేజ్ చేసింది. ఆయుష్ 19, వైభవ్ 2 పరుగులు చేయగా అభిజ్ఞాన్ (42) నాటౌట్గా నిలిచారు. 5 వికెట్లు తీసిన హెనిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
News January 15, 2026
మృణాల్, ధనుశ్ పెళ్లంటూ ప్రచారం!

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని దాని సారాంశం. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఖండించారు. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 15, 2026
తిరుమలలో వరుస సెలవులతో భక్తజనసంద్రం

వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు చేరగా, దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతోంది. రూములు దొరక్క కొందరు భక్తులు లాకర్లు, ఆరుబయటే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాలినడక మార్గాల్లోనూ భారీ రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతుండగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.


