News February 12, 2025

టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకెళ్తే..

image

టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుంది. టాయిలెట్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్‌పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it

Similar News

News February 12, 2025

‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం

image

థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.

News February 12, 2025

ఇక్ష్వాకు వంశంపై హరగోపాల్ ఏమన్నారంటే?

image

ఇక్ష్వాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పురాణాల ప్రకారం రాముడిది ఇక్ష్వాకు వంశం. అలాగే, తెలుగునాట కూడా ఈ పేరుతో ఓ రాజవంశం ఉండేది. శాతవాహనుల తరువాత పాలించింది ఆంధ్ర ఇక్ష్వాకులు. ‘ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఈ వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ చెబుతున్నారు.

News February 12, 2025

జగన్ మద్యంతో ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్: మంత్రి రవీంద్ర

image

AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యేగా సభకు రావొచ్చని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైందని విమర్శించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

error: Content is protected !!