News February 12, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుహాసిని

బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని, కోళ్ల ఫారాల నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం శానిటైజర్లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. మాస్క్ ధరించిన తరువాత ఫారాల్లో పనులు చేయాలని సూచించారు.
Similar News
News November 10, 2025
JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 10, 2025
వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలి: ASP

ప్రజల ఫిర్యాదులను చట్టపరిధిలోని తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 42 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి 7రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.
News November 10, 2025
NLG: ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కారం కావాలని, ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.


