News February 12, 2025

మేడ్చల్ జిల్లాలో సిజేరియన్‌లు భారీగా పెరిగాయి

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయి. కొద్దిసేపు గర్భిణీకి నొప్పులు రాగానే తట్టుకోలేకపోవడంతో ఒత్తిడి తెచ్చి కుటుంబీకులు సీజేరియన్ కోసం అడుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలో 56కుపైగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. సాధారణ ప్రసవాలకు మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగుతుండటంతో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

News February 12, 2025

14న కడపకు మాజీ సీఎం జగన్ రాక

image

ఈనెల 14న కడప నగరానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహానికి జగన్ హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి కడపకు చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం జగన్ నేరుగా బెంగళూరుకు వెళ్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.

News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!