News February 12, 2025

బోయిన్పల్లి: మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ

image

బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్ఎండికి 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంట పొలాలకు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.

News February 12, 2025

వికారాబాద్‌: ఎండ వేడిలో దాహం తీర్చుకున్న ఓ కోడె

image

వేసవి సమీపిస్తున్న వేళ దాహంతో ఓ మూగ జీవి అల్లాడిన పరిస్థితి అనంతగిరిలో కనిపించింది. వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే మార్గంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఓ కోడె దాహం కోసం బొట్టు బొట్టు కారుతున్న నల్లా ద్వారా దాహం తీర్చుకుంటుంటే ఓ జంతు ప్రేమికుడు వెళ్లి పక్కన ఉన్న నల్లా తిప్పి కోడె దాహం తీర్చాడు. అందుకు జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు.  

News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

error: Content is protected !!