News February 12, 2025

తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

image

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.

Similar News

News January 6, 2026

రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. బాధితురాలి ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ!

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో పి.పద్మావతి అనే బాధితురాలికి న్యాయం చేకూరింది. ఆమెకు రావాల్సిన రూ.11,09,637 పెన్షన్ బకాయిలు ఈనెల 2న బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. అలాగే నెలకు రూ.14 వేల పింఛను మంజూరైంది. 2022లో ఆమె దాఖలు చేసిన అర్జీపై స్పందించి పరిష్కరించినందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంథం సునీత, కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మిలకు పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.

News January 6, 2026

రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

image

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.

News January 6, 2026

సంక్షేమమే లక్ష్యం.. అబ్కారీ శాఖపై మంత్రి కొల్లు సమీక్ష

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వేదికగా మంగళవారం అబ్కారీ, మధ్యపాన నిషేధ శాఖపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, సమాజ సంక్షేమమే ధ్యేయంగా అబ్కారీ శాఖ పనిచేయాలని ఆదేశించారు. శాఖాపరమైన పనితీరులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.