News February 12, 2025

కరీంనగర్ జిల్లా పరిధిలోని ఓటర్ల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1,229 గ్రామ పంచాయతీలు, 649ఎంపీటీసీ స్థానాలు, 18,77,570 మంది ఓటర్లు ఉన్నారు. JTLజిల్లాలో385జీపీలు, 3,536 వార్డులు, 216ఎంపీటీసీలు, 6.09.496 మంది, KNR జిల్లాలో 318 జీపీలు, 2,962 వార్డులు,170ఎంపీటీసీలు, 5.08,489, PDPLజిల్లాలో 266 జీపీలు, 2,486 వార్డులు,140 ఎంపీటీసీలు, 4,13,306, SRSLజిల్లాలో 260 పంచాయతీలు, 2,268 వార్డులు, 123 ఎంపీటీసీ లు. 3,53,796 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News November 4, 2025

దెందులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

దెందులూరు మండలం సత్యనారాయణపురం 16 నంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్ఐ శివాజీ మంగళవారం తెలిపారు. ఏలూరు గుండుగొలను మార్గంలో సత్యనారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు దెందులూరు పోలీసులకు తెలియజేయాలన్నారు.

News November 4, 2025

మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

image

జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.