News March 20, 2024
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇచ్చాపురం బుడతడికి చోటు
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇచ్చాపురానికి చెందిన ఏడేళ్ల బాలుడు పడాల పార్థివ్కు చోటు దక్కింది. గతంలో 1 నుంచి 50 వరకు క్యూబ్స్ను 1 నిమిషం 36 సెకన్లలో రాసి చోటు దక్కించుకున్నట్లు తండ్రి అప్పలనాయుడు, తల్లి లక్ష్మి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు 1 నుంచి 100 వరకు క్యూబ్స్ను 4 నిమిషాల 24 సెకన్లలో చెప్పినందుకు ఈ గౌరవం దక్కిందని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
Similar News
News July 5, 2024
అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి
అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.
News July 5, 2024
శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి
పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News July 5, 2024
నేడు విశాఖ-గుణుపురం రైలు రద్దు
విశాఖ-గుణుపురం మధ్య నడుస్తున్న రైలును శక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. పూండి- నౌపడ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.