News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739343015207_367-normal-WIFI.webp)
ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
Similar News
News February 12, 2025
ఏ సినిమాకు వెళ్తున్నారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350166795_746-normal-WIFI.webp)
ఈ వారం కొత్త సినిమాల కంటే పాత సినిమాల హవానే ఎక్కువగా ఉంది. వాలంటైన్స్ డే కావడంతో పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈనెల 14న విశ్వక్సేన్ ‘లైలా’, బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదేరోజున రామ్ చరణ్ ‘ఆరెంజ్’, సూర్య ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ కానున్నాయి.
News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358201566_81-normal-WIFI.webp)
AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
News February 12, 2025
INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357268335_746-normal-WIFI.webp)
నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.