News February 12, 2025

జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ 

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.

Similar News

News September 17, 2025

NPDCL కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

image

హనుమకొండ NPDCL కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల అమరుల స్తూపం వద్ద పూలదండ వేసి నివాళులర్పించారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమ లక్ష్యంగా తెలంగాణ ప్రగతి సూచికల్లో అగ్రగామి రాష్ట్రంగా మారిందన్నారు.

News September 17, 2025

ఏలూరు: కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి

image

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆమె మాట్లాడుతూ.. వాస్తుశిల్పంలో విశ్వకర్మ చేసిన కృషిని కొనియాడారు. సాంప్రదాయ వృత్తుల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 17, 2025

సిరిసిల్ల: సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి

image

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ మహాసభలో పాల్గొన్నారు. ఈయన 1930లో తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసారు. అక్కడ జరిగే దుర్మార్గాలను సహించలేక పూర్తి కాలం కార్యకర్తగా తనతోపాటు అనేకమందిని ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగారు. మహమ్మదాపూర్ గుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈయన తుది శ్వాస విడిచారు.