News February 12, 2025

సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.

Similar News

News October 25, 2025

పార్వతీపురం: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08963 796085 నంబర్‌కి ఫోన్ చేస్తే, వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు.

News October 25, 2025

SKLM: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

image

మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుపాను జిల్లాపై అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని, జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో నేడు టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యవసర సమయాల్లో 08942-240557 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.

News October 25, 2025

ములుగు: బడి తప్పియ్యని పంతులుకు పురస్కారం..!

image

ఉపాధ్యాయుల హాజరు శాతం నమోదు కోసం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో జంగాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాసమల్ల కృష్ణమూర్తి అత్యధిక హాజరు శాతాన్ని నమోదు చేశారు. ఈ విధానం అమలులోకి వచ్చిన 38 రోజుల్లో 36 రోజులు ఆయన పాఠశాలకు వచ్చారు. ఇలా రాష్ట్రంలో ముగ్గురు మాత్రమే ఉండగా.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కృష్ణమూర్తిని ఉన్నతాధికారులు సత్కరించారు. డీఈవో సిద్దార్థ్ రెడ్డి అభినందించారు.