News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739351004101_52434823-normal-WIFI.webp)
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.
Similar News
News February 12, 2025
సిరిసిల్ల: గంజాయి సాగుచేస్తూ.. తాగుతున్న వ్యక్తుల అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363774594_51855990-normal-WIFI.webp)
సిరిసిల్ల మండలం పెద్దూరు మెడికల్ కాలేజీ పక్కన 4 వ్యక్తులు గంజాయిని సాగుచేస్తూ.. తాగుతుండగా వారిని అరెస్ట్ రిమాండ్ తరలించామని CI కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దేద్రాడ్ ధలి, మాలే మాలిక్, ప్రణబ్ సింగ్, సాగర్ సర్కార్ అనే వ్యక్తులు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వచ్చారు. పక్కనే ఉన్న స్థలంలో గంజాయి మొక్కలను సాగుచేస్తూ.. తాగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని 50G గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News February 12, 2025
అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368874903_1045-normal-WIFI.webp)
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
News February 12, 2025
వినుకొండ: గుర్తు తెలియని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368748806_1286-normal-WIFI.webp)
వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో అంబేడ్కర్ నగర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని తెలిపారు.