News February 12, 2025

NRPT: ప్రేమికుల రోజు అడ్డుకుంటాం: బజరంగ్ దళ్

image

నారాయణపేటలో ప్రేమికుల రోజును అడ్డుకుంటామని బజరంగ్ దళ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, విహెచ్పి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నారాయణపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేమికులకు వ్యతిరేకం కాదని అన్నారు. 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారని, ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.

Similar News

News September 17, 2025

సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

image

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్‌ ఎక్సెల్‌పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2025

ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్.. APPLY

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. SHARE IT.

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.