News February 12, 2025

ఎల్లారెడ్డి: అపార్ వివరాలను తక్షణమే పూర్తి చేయాలి: డీఈఓ

image

ఆపార్ వివరాలను ఆన్‌లైన్లో తక్షణమే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశించారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బుధవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి హాజరై మాట్లాడారు. యుడైస్‌లోని ఖాళీలు పూర్తి చేయాలన్నారు. సెలబస్ పూర్తిచేసి రివిజన్ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.

News February 13, 2025

KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్

image

నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 13, 2025

ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం

image

భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.

error: Content is protected !!